టేకులపల్లి, జనవరి 1: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలని ఎస్వోటూ జీఎం మల్లయ్య అన్నారు. కోయగూడెం ఉపరితల గనిలో ఆదివారం నిర్వహించిన ‘నా భద్రత.. నా బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఒకే గమ్యం’ అనే స్ఫూర్తితో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు తావులేని సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేఓసీ పీవో ప్రహ్లాద్, గని మేనేజర్ సౌరభ్ సుమన్, రాజు, సీనియర్ పర్సనల్ అధికారి పి.కృష్ణ, పిట్ సెక్రటరీ అశోక్కుమార్ పాల్గొన్నారు.
కొత్తగూడెం ఏరియాలో..
రామవరం, జనవరి 1: సింగరేణిని ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాలని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏరియా ఉన్నతాధికారులు, సూపర్వైజర్లు, టెక్నికల్ సిబ్బంది, డీఎల్ఆర్ కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి యాజమన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. రక్షణ సూత్రాలను పాటించాలని సూచించారు.