సత్తుపల్లి :మండల పరిధిలోని సిద్ధారం ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి,పంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
అనంతరం ఆలయకమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామనాయకులు మోరంపూడి ప్రభాకర్, ప్రసాద్, నక్కా గాంధీ, నాగరాజు, ఆదినారాయణ, ఈదుల నర్సింహారావు, గంధం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.