చింతకాని, మే 5: ప్రొద్దుటూరు గ్రామం ఎర్రబోడు పోలాల్లో మారెమ్మ తల్లి ఆలయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లాకన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు వేదమంత్రాల మధ్య గురువారం ప్రారంభించారు. తొలుత పూజారులు, ఆలయకమిటీ సభ్యులు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు మారెమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల కృషితో ఆలయ సమీపంలో నిర్మించిన భోజనశాల, బోర్వెల్ను ప్రారంభించి ఆలయ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో దాతలు పెంట్యాల పుల్లయ్య, పెంట్యాల భారతమ్మ, పర్చగాని తిరుపతికిశోర్, గుర్రం రమేశ్, గుడిపూడి రమేశ్, గుర్రం నరసింహారావు, వడ్డే ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు కోపూరి పూర్ణయ్య, గురజాల హనుమంతరావు, తుడుం రాజేశ్, కొండపల్లి శేఖర్రెడ్డి, కిలారు మనోహర్, వంకాయలపాటి వెంకట లచ్చయ్య, బొడ్డు వెంకట్రామారావు, గడ్డం శ్రీను, నల్లమోతు శేషగిరి, ఆవుల నాగేశ్వరరావు, తుళ్ళూరి అచ్చయ్య, బండి తిరపయ్య, గుర్రం రామారావు, జానపాటి ఆదినారాయణ, చల్లా అచ్చయ్య,బోగ్గారపు శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మండలంలోని పాతర్లపాడు-ప్రొద్దుటూరు గ్రామాల రహదారి నిర్మాణానికి గ్రామస్తులు, రైతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రారంభానికి వచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. స్పందించిన నామా రానున్న నిధుల నుంచి రహదారి వేస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానం గొప్పది : అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు.
మధిర రూరల్, మే 5: దేశినేనిపాలెం, ఆత్కూరు గ్రామాల్లో పలు కుటుంబాలను ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు. తొలుత దేశినేనిపాలెం గ్రామంలో ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు మాతృమూర్తి ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆత్కూరు గ్రామంలో మృతిచెందిన మాజీ సర్పంచ్ అబ్బూరి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బొగ్గుల భాస్కర్రెడ్డి, నిధానపురం సర్పంచ్ బాదా కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, నల్లమల శ్రీనివాసరావు, అరిగె శ్రీనివాసరావు, మల్లాది వాసు, సయ్యద్ ఇక్బాల్, జీవీ రెడ్డి, ఆళ్ల నాని, సిద్ధినేనిగూడెం సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, యర్రగుంట రమేశ్, ఆవుల రాము తదితరులు పాల్గొన్నారు.