ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా సోకిన విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. ఆదివారం దాదాపు 27 మందికి పైగా విద్యార్ధులకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ నామ వెంటనే స్పందించి సంబంధిత జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి మాలతికి ఫోన్ చేశారు.
కరోనాతో బాధపడుతున్న ప్రతి విద్యార్ధికి మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. అలాగే సంబంధిత గరుకుల పాఠశాలల జిల్లా అధికారితో కూడా నామ ఫోన్లో మాట్టాడారు. పరిస్థితి చక్కబడి విద్యార్ధులు కొలుకోనే వరకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టాలన్నారు. మిగిలిన విద్యార్ధులు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు.