భద్రాచలం, డిసెంబర్ 31: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. ఆయనను ఆదివారం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశానని, ఉద్యోగుల సమస్యలు తెలుసని అన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని అన్నారు. సంఘం అధ్యక్షుడు భూషణరావు, నాయకులు తిప్పన సిద్ధులు, తులసీదాసు, కోటేశ్వరరావు, రామచంద్రరావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.