మధిర టౌన్, డిసెంబర్ 1: పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిరలో నూతనంగా నిర్మిస్తున్న వంద బెడ్ల ఆసుపత్రి నిర్మాణ పనులు, మధిర పెద్దచెరువు అభివృద్ధి పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులతోపాటు చిరువ్యాపారుల కోసం ఏర్పాటు చేయనున్న స్థలం, మెయిన్రోడ్డు విద్యుదీకరణ స్థలాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం సమీకృత మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధిర అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక దృష్టిపెట్టారని, అందుకోసం అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. వంద బెడ్ల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం, మధిర చెరువును అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తికానున్నాయన్నారు.
మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా, శిశు సంక్షేమ భవనాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నిధుల కేటాయించినట్లు వివరించారు. మధిరలో చేపడుతున్న ఆయా అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు మొండితోక లత, మల్లాది వాసు, వైవీ అప్పారావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బిక్కి ప్రసాద్, అంబటి రమాదేవి, చిత్తారు నాగేశ్వరరావు, మొండితోక జయాకర్, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, కోన నరేందర్రెడ్డి, తాళ్లూరి హరీశ్, బీవీఆర్, కరివేద సుధాకర్, బోయపాటి వెంకటేశ్వరరావు, ఐలూరి ఉమామహేశ్వరరెడ్డి, మేడికొండ కిరణ్, గద్దల నాని, రాజా, దుర్గాప్రసాద్, జేవీ రెడ్డి, అబ్బూరి రామన్ పాల్గొన్నారు.