చింతకాని, ఆగస్టు 18: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని లచ్చగూడెం మినీ స్టేడియంలో ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. సర్పంచ్ గురజాల ఝాన్సీ, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, సొసైటీ డైరెక్టర్ తాతా ప్రసాద్, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ పీటీ కిశోర్, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ మంగీలాల్, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, నాయకులు పెంట్యాల పుల్లయ్య, కిలారు మనోహర్, నూతలపాటి వెంకటేశ్వర్లు, మంకెన రమేశ్, బండి సుభద్ర, శ్రీదేవి, లలిత, వెంకట్రామారావు, రాంబాబు, కార్యదర్శులు పాల్గొన్నారు.
బోనకల్లు, ఆగస్టు 18: వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడాప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించారు.
మధిరటౌన్, ఆగస్టు 18: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ రాంబాబు, ఎంఈవో ప్రభాకర్, మధిర ఎస్సై సతీశ్కుమార్ ప్రారంభించారు.
మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవాల సందర్భంగా కలయిక వాకర్స్క్లబ్, స్విమ్మర్స్ క్లబ్ మధిర సంయుక్తంగా గురువారం మండల స్థాయిలో స్వతంత్ర ఉద్యమంలో తెలుగు వారి పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ముదిగొండ, అగస్టు 18: వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో వెంకటాపురం గ్రామం విజేతగా నిలిచింది. విజేతలకు ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి బహుమతులు స్పాన్సర్ చేశారు. ఎస్ఐ తోట నాగరాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఎంపీపీ హరిప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ దామోదర్, సర్పంచ్ అనంతరాములు, మల్లయ్య పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, ఆగస్టు 18: అమరుల ఆశయాలు మనకు స్ఫూర్తి కావాలని ఎంపీపీ బోడా మంగీలాల్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఎంపీడీవో జయరాం, తహసీల్దార్ పుల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.