బోనకల్లు, డిసెంబర్ 13: సమాజ సేవలో ప్రతిఒక్కరూ ముందుండాలని మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక శాంతినిలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మానసిక వికలాంగుల పిల్లల మధ్య క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న సంపాదనలో ఎంతోకొంత సామాజిక ఖర్చు చేసినప్పుడే ప్రయోజనం చేకూరుతుందన్నారు. శాంతినిలయంలో సిస్టర్ ఆల్పీ పిల్లలకు చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ బిషప్ మైపాల్, సర్పంచ్ భుక్యా సైదానాయక్, బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, కోట రాంబాబు, ఉమ్మనేని కృష్ణ, బీరెల్లి కృష్ణ, వాసు, కరివేద శ్రీహరి, బండి వెంకటేశ్వర్లు, తోటకూర వెంకటేశ్వర్లు, శాంతినిలయం నిర్వాహకురాలు సిస్టర్ అల్పీ పాల్గొన్నారు.
పలు కుటుంబాలకు పొంగులేటి పరామర్శ
కూసుమంచి రూరల్, డిసెంబర్ 13: మండలంలోని ధర్మాతండా, జుజ్జుల్రావుపేట, జక్కేపల్లి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన జర్పుల కిశోర్, గుగులోత్ మంగ్త్యా, రావెళ్ల సక్కుబాయమ్మ, మెట్టు లక్ష్మమ్మ, మెట్టు దాక్షాయమ్మ, కొప్పెర పెంటమ్మ, గరిడేపల్లి శ్రీనివాస్రావు కుటుంబాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. తొలుత మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించి ఆర్థికసాయం అందజేశారు. మీకు అండగా ఉంటానని, ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. పొంగులేటి వెంట బీఆర్ఎస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, ముదిరెడ్డి కేశవరెడ్డి, సేట్రామ్ నాయక్, బొల్లంపల్లి సుధాకర్రెడ్డి, సర్పంచ్ జర్పుల పింప్లీ ఉన్నారు.
కూసుమంచిలో..
కూసుమంచి, డిసెంబర్ 13: మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. కూసుమంచిలో ఇటీవల మరణించిన గుండా చినసత్యనారాయణరెడ్డి, అర్వపల్లి పాండు, అర్వపల్లి పరశురాం చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రజకులకు రూ. 10వేలు అందజేశారు. నాగాచారి, జానికిరాములు కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్, బారి వీరభద్రం, పాల్గొన్నారు.