ఖమ్మం, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని తన స్వగ్రామమైన తెల్దారుపల్లిలో సోమవారం అస్వస్థతకు గురయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామానికి విచ్చేశారు. మధ్యాహ్నం ఆయనకు ఉన్నట్టుండి చెమటలు పట్టాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి హార్ట్బీట్ తక్కువ సార్లు నమోదవుతున్నదని గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పార్టీ నాయకులు, గ్రామస్తులు ఆందోళన చెందొద్దదని అక్కడి వైద్యులు తెలిపారు.