రఘునాథపాలెం, మార్చి 4 : పెద్ద పట్టణాలకే పరిమితమైన ‘కాంచీపురం వరమహాలక్ష్మి’ వస్త్ర దుకాణం ఖమ్మం జిల్లా ప్రజల చెంతకు చేరింది. ఖమ్మం బైపాస్ రోడ్లోని కొత్త బస్టాండ్ వద్ద ఒకటి, మరో దుకాణాన్ని కస్బాబజార్లో నూతనంగా ఏర్పాటు చేశారు. తమ వ్యాపారాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఖమ్మంలోనే రెండు దుకాణాలను నెలకొల్పారు. సోమవారం బైపాస్ రోడ్డులోని నూతన వస్త్ర దుకాణాన్ని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ ముఖ్యఅతిథిగా పాల్గొనగా.. అమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ మల్లు నందిని విక్రమార్క, యూత్ కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకే పరిమితమైన ‘కాంచీపురం వరమహాలక్ష్మి’ ఖమ్మంలోనూ ప్రారంభించడం సంతోషకరమన్నారు. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చలవాడి ప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మంలో నూతన స్టోర్ను ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నామన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 44.90 శాతం ఆదాయం తెలంగాణ రాష్ట్రం నుంచే లభించినట్లు పేర్కొన్నారు. చీరల విక్రయాల్లో 50 శాతం వాటా కలిగిన దక్షిణ భారత మార్కెట్పై దృష్టి పెట్టాలని కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ బాధ్యులు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.