కొత్తగూడెం అర్బన్, మే 25: నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. విద్యావంతుడు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని 35వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ రుక్మాగంధర్ బండారి ఆధ్వర్యంలో పట్టభద్రులను కలిసి ప్రచారం చేశారు.
చుంచుపల్లి, మే 25 : పట్టభద్రుల ఆదరణ చూస్తుంటే రాకేశ్రెడ్డి విజయం తథ్యమని బీఆర్ఎస్ నేత మూడ్ జయరాంనాయక్ అన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చుంచుపల్లిలో ప్రచారం చేశారు. పట్టభద్రుల ఆదరణ రాకేశ్రెడ్డికి ఎక్కువగా ఉందన్నారు.
పాల్వంచ, మే 25: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ పాల్వంచలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాల్వంచ పట్టణ పార్టీ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్ పటేల్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ కాలనీలో, సెంట్రల్ ఆఫీస్ కర్మాగారాలు, గేటు వద్ద కార్మికుడు, ఇంజినీర్లు, పట్టభద్రులందరినీ కలిసి రాకేశ్రెడ్డికి ఓటు వేయాలని కోరారు.
సారపాక, మే 25: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి పట్టభద్రులను శనివారం కోరారు.
మణుగూరు టౌన్, మే 25: ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేస్తున్న విద్యావంతుడు, ప్రజా సమస్యలపై గళమెత్తే ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం ఒక ప్రకటనలో పట్టభద్రులను కోరారు.
అశ్వాపురం, మే 25: ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు వెన్నా అశోక్కుమార్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం మండలంలో ప్రచారం నిర్వహించారు.
సారపాక, మే 25: ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి విజయాన్ని కోరుతూ బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ఆధ్వర్యంలో శనివారం నాయకులు ఐటీసీ ఎంప్లాయీస్ కాలనీలో ప్రచారం నిర్వహించారు.
కరకగూడెం, మే 25: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పట్టభద్రులని కలిసి ప్రచారం నిర్వహించారు.
భద్రాచలం, మే 25: రాకేష్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ నమూనా బ్యాలెట్ పత్రాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రభోత్కుమార్, పూర్ణ చందర్రావు ప్రచారం నిర్వహించారు.
ఇల్లెందు రూరల్, మే 25: రాకేశ్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక శనివారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. సుభాష్నగర్, బాలాజీనగర్, కరెంటాఫీస్, ఇందిరానగర్, సంజయ్నగర్ తదితర ఏరియాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటు ప్రాధాన్యత గురించి వివరించారు.
టేకులపల్లి, మే 25: రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు అన్నారు. శనివారం మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, ముత్యాలంపాడు గ్రామాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చండ్రుగొండ, మే 25: నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేశ్రెడ్డి విజయం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా వెంకేశ్వరరావు(బాబు) అన్నారు. శనివారం చండ్రుగొండ పంచాయతీలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాడు.
దమ్మపేట, మే 24: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవనీయులనే పెద్దల సభకు పంపుదామని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పర్వతనేని రామక్రిష్ణ అన్నారు. గ్రామాల్లో దొడ్డా రమేశ్తో కలిసి ప్రచారం నిర్వహించారు.
అన్నపురెడ్డిపల్లి, మే 25: రాకేశ్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు.