భద్రాచలం, ఆగస్టు 15: గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం భద్రాచలం ఐటీడీఏలో ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు మెరుగైన విద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సాయం పథకం, వనబంధు కల్యాణ యోజన, నైపుణ్యాభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రమాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.