రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని, ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్(సర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత బీఎల్ఏలదే అన్నారు.
ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీజెండా ఎగరాలని ఆకాంక్షించారు. ఖమ్మంలో మూడు పెద్ద కోతులు ఉన్నాయని, అవి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అప్పుడు ఒకే ఒక మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఉంటే ఖమ్మం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ముగ్గురు మంత్రులున్నా ఏమీ సాధించలేదని విమర్శించారు.