తల్లాడ, డిసెంబర్ 26: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో మండల విద్యార్థి ప్రతిభ చాటి జిల్లాకే వన్నె తెచ్చాడు. మండలంలోని గోపాలపేటకు చెందిన నున్నా భరత్ (27) తొలి ప్రయత్నంలోనే ఐఈఎస్ నెగ్గి సత్తా చాటాడు. లక్ష మందికి పైగా పోటీపడ్డ ఈ అఖిల భారత సర్వీస్లో 48వ ర్యాంకర్గా నిలిచారు. తెలుగు రాష్ర్టాల్లో ఖమ్మం జిల్లా నుంచి గ్రామీణ ప్రాంతానికి చెందిన భరత్ ఈ సర్వీసుకు ఎంపిక కావడం పట్ల స్థానికంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన తండ్రి నున్నా వెంకటకృష్ణారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తల్లి పద్మ గృహిణి. భరత్ తొలి నుంచీ ఇంజినీరింగ్ విద్యలో ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిస్టింక్షణ్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్లోనూ డిస్టింక్షన్ సాధించాడు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని మేడ్ ఈజీ సంస్థలో సెంటర్ కాంటెంట్ డెవలపర్గా పనిచేస్తున్నాడు. భరత్ పదో తరగతి వరకు ఖమ్మం వీవీసీ పబ్లిక్ స్కూల్లోనే చదివాడు.