అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఫైటింగ్ సెంచరీ చేశాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. టెస్టుల్లో అతనికిది మూడో సెంచరీ. 116 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ఈ సెంచరీ చేశాడు. రూట్ బౌలింగ్లో సిక్స్ కొట్టి మరీ పంత్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడిన పంత్.. హాఫ్ సెంచరీ పూర్తియన తర్వాత స్పీడు పెంచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ కొత్త బాల్ తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అయితే ఆ వెంటనే ఆండర్సన్ బౌలింగ్లో 101 పరుగుల దగ్గర ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి పంత్ ఏడో వికెట్కు 113 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. మరోవైపు సుందర్ కూడా హాఫ్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు.