అవకాశాలను సద్వినియోగం చేసుకోండి..
మంత్రి కొప్పుల ఈశ్వర్..
ధర్మపురిలో ఉచిత శిక్షణ తరగతుల సందర్శన..
ధర్మపురి, మే 17: పట్టుదలతో శ్రమిస్త్తే ఉద్యోగం సాధించడం సులువేనని, ప్రభుత్వం కల్పించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సంక్షేమ శాఖ, ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీ స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని షాదీఖాన, న్యూ టీటీడీ కల్యాణ మండపాల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతుల ను మంగళవారం మంత్రి సందర్శించి ఉచిత స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈసందర్భం గా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందనీ, ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికై సమాజంలో గుర్తిం పు పొందడంతోపాటు తల్లిదండ్రుల కలలు సా కారం చేసినట్లవుతుందన్నారు.
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 91వేల ఉద్యోగాలు ప్రకటించిన ఘనత మన సీఎం కేసీఆర్దేనన్నారు. ఉద్యోగం సాధన కో సం శిక్షణ కోసం వేలాది రూపాయలు ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత లేని నిరుపేదల కోసం ఈ ఉచితశిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. వీటిని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర సర్కార్ ఏడాదికి రూ.2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి డాబులు పలికి, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, ప్రైవేటు సంస్థలను అమ్ముకునే దుస్థితికి దిగజారిందని దు య్యబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్ప డ్డ తర్వాత అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. అనంతరం ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలత మాట్లాడుతూ, అభ్యర్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలన్నారు.
మినీ స్టేడియానికి రూ.2.65కోట్లు..
ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు మంజూరయ్యాయని మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల మైదానాన్ని పరిశీలించారు. టెండర్ల ప్రక్రి య పూర్తికాగానే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మాజీ వైస్చైర్మన్ సునీల్, కౌన్సిలర్లు తరాల్ల కార్తీక్, యూనుస్, అశోక్, కోఆప్షన్ సభ్యు లు అప్పాల వసంత్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఆకుల రాజేశ్, నాయకులు ఒడ్నాల మల్లేశం, పురాణపు సాంబమూర్తి, కొంపల తిరుపతి, చిలివేరి శ్యాంసుందర్ తదితరులున్నారు.