బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చేస్తున్న సమగ్రాభివృద్ధికి ఆకర్షితులై ఊరూవాడా జైకొడుతున్నది. ‘పార్టీ వెంటే ఉంటామని, కేసీఆర్, కేటీఆరే మా నాయకులు’ అంటూ నినదిస్తున్నది.
గంభీరావుపేట, డిసెంబర్ 21 : మంత్రి కేటీఆర్ పిలుపుతో గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం కులమతాలు, వర్గ విభేదాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చారు. బుధవారం సర్పంచ్ కత్తుల బాబు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ బలపరిచిన గంభీరావుపేట డైరెక్టర్ స్థానం అభ్యర్థి గౌరినేని నారాయణరావుకు ఓటర్లు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. 20 ఏళ్లుగా రెండు వర్గాలున్నా మంత్రి కేటీఆర్ పిలుపుతో వాటిని పక్కన పెట్టి గ్రామస్తులు సెస్ ఎన్నికపై ఏకాభిప్రాయం తీసుకోవడం అభినందనీయమన్నారు. అభివృద్ధికి ఆకర్శితులై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు చొరవతో బీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ అభ్యర్థి గౌరినేని నారాయణరావు, ఉపసర్పంచ్ కాశీ, నేతలు వంగ సురేందర్రెడ్డి, మాణిక్యరావు, సుధాకర్రావు, భూషణం, ప్రభాకర్రావు, భగవంతరావు, అక్కపల్లి రాజనర్సింహారెడ్డి, రంగారావు, స్టీఫెన్, బాలరాజు, సంజయ్య, నర్సింగరావు, కమలాకర్రావు, శ్రీనివాస్గౌడ్, నారాగౌడ్, శ్రీనివాస్, గణేశ్, నర్సింహులు, స్వామి, ప్రశాంత్ ఉన్నారు.