Farmers | గన్నేరువరం, జూలై26: మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో అలుగు పారుతోంది. దీంతో పంటలకు కొదవలేదని రైతన్నలు తమకు రెండు పంటలకు నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.