Vemulawada | వేములవాడ, జూన్ 12 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మురికి కాల్వలలో పేరుకు పోయిన చెత్తాచెదారం, రహదారులపై వేస్తున్న చెత్త డంపులు, కాలనీలో పరిశుభ్రతపై వారు తనిఖీ చేసి మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అక్రమంగా రహదారులపై చెత్త డంపులు వేసిన వారిని గుర్తించి జరిమానా విధించాలన్నారు. మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి వరదనీటితో కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ తదితరులు ఉన్నారు.