కమాన్చౌరస్తా, ఏప్రిల్ 19: దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించగా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రితో కలిసి వినోద్కుమార్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
మహనీయుల చరిత్రను చదువుకోవాల్సిన అవసరం ఉన్నదని, వారి త్యా గాలే దేశానికి దిశానిర్దేశాలు చేశాయన్నారు. ఫూలే, అంబేదర్, బాబు జగ్జీవన్ రాంలు చదువు కోసం చేసిన కృషి ఎనలేనిదన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబా ద్రి మాట్లాడుతూ, మహనీయులంతా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. అన్ని రకాల ప్రజల మధ్య అంతరాలను తగ్గించడానికి, సామాజిక అభివృద్ధికి పునాదులు వేశారని, అందుకే వారు మహనీయులయ్యారన్నారు. గౌరవ అతిథి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్ మాట్లాడుతూ, మహనీయుల జయంతులను జరుపుకోవడం నేటి స మాజానికి, యువతరానికి ఎంతో ఆవశ్యకమని అన్నారు.
సభాఅధ్యక్షత వహించిన విశ్వవిద్యాల య ఉపకులపతి ఆచార్య మల్లేశ్ సంకశాల మాట్లాడుతూ, నేటి సమాజంలో నిమ్న కులాలు, దళిత బహుజనులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అందుతున్నాయంటే రిజర్వేషన్ ఫలాలే కారణమని, మహనీయుల కృషేనని చెప్పారు. యువతరం స్ఫూర్తి పొందడానికి వారు రచించిన పుస్తకాలు చదవి బాధ్యతాయుతంగా మెలగాలని పి లుపునిచ్చారు. ఇక్కడ బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సరసిజ, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇక్కడ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రంగప్రసాద్, పరీక్షల అదనపు నియంత్రణ అధికారి అబ్రాఆర్ బాఖి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాఫర్ జరి, సైన్స్కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ యంతి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికాంత్, డీన్ ఆచార్య సుజాత, ఆచార్య పురుషో త్తం, ఆచార్య సాయిలు, వన్నాల రమేశ్, హుమెర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు య శ్వంత్ రావు, డాక్టర్ రాజు, డాక్టర్ మనోహర్, మ నోజ్, తిరుపతి, విజయ ప్రకాశ్, డాక్టర్ లక్ష్మీనారాయణ,అనూష,కిరణ్,విజయ్కుమార్ ఉన్నారు.