జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 13: ఏఎస్ఐ రాజమల్లయ్య కుటుంబానికి పోలీసుశాఖ భరోసానిచ్చింది. వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన రాజమల్లయ్య కొద్దిరోజుల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ క్రమంలో పోలీసు భద్రత పథకం కింద ఆయనకు 7.63లక్షలు మంజూరయ్యాయి.
మంగళవారం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఏఎస్ఐ కుటుంబానికి చెక్కును అందజేశారు. అధైర్యపడొద్దని, పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డీపీవో ఏవో అమర్నాథ్, సూపరింటెండెంట్ నయీం ఉన్నారు.