రాయికల్, ఏప్రిల్ 15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు మార్ అన్నారు. నిరుపేదలకు వైద్యం భారంకావద్దనే ఉద్దేశంతో సర్కారు ఈ వైద్యశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిందన్నారు. సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ను అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. తె లంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా 57 ర కాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని. రూ.2 కోట్లతో జిల్లా వైద్యశాలలో సీటీ సాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నే రేడియాలజీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.
మీడియా ప్రతినిధులు రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాయికల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను శనివారం ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యసేవలందించే లక్ష్యంతో పట్టణంలోని ఇస్లాంపూర్, టీఆర్నగర్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, రాయికల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ ఖయ్యూం, కౌన్సిలర్లు అనురాధ, కాంతారావు, శ్రీధర్రెడ్డి, మహేశ్గౌడ్, సత్యనారాయణ, మ హేందర్, సాయి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ సంతోష్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉదయ శ్రీలింగంగౌడ్, కో ఆప్షన్ మహేందర్ బాబు, యూత్ నాయకులు మోర రామ్మూర్తి, అనిల్, బాబా, రాజేశ్, కొత్తపెళ్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.