రాయికల్, జనవరి 23: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రాయికల్ మండలం రామారావు పల్లె ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కడకుంట్ల అభయ్ రాజ్ ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా విద్యా శాఖ 19 నుంచి 21 దాకా వర్చువల్గా నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ విభాగంలో అభయ్రాజ్ ప్రతిభచూపారు. తకువ ఖర్చుతో తయారు చేసిన సూపర్ సైన్స్ కిట్ బోధనోపకరణాలను ప్రదర్శించి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి బాజోజి శ్రీనివాస్ తెలిపారు. కాగా, అభయ్రాజ్ను డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, ఎంఈవో గంగాధర్, మండల నోడల్ అధికారి శ్రీపతి రాఘవులు అభినందించారు.