గంభీరావుపేట, నవంబర్ 18: మండలంలోని పాఠశాలల్లో గురువారం స్వయం పాలన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర, దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత, నాగంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. మండల కేంద్రంలోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెచ్ఎంలు గంగారాం, బాలెల్లయ్య, నారాయణ, గజన్లాల్, సంతోష్రెడ్డి ఉన్నారు.
మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంగన్ వాడీ సూపర్వైజర్ పద్మజ, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, రాధమ్మ, చిన్నారులు ఉన్నారు.
బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పాఠాలు బోధించారు. అనంతరం గురువులతో కలిసి ఫొటోలు తీయించుకుని మురిసిపోయారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మండల కేంద్రంలోని బాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో చిన్నారులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించగా ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. హెచ్ఎంలు రవీందర్, విఠల్నాయక్, ఉపాధ్యాయులు సుధాకర్, రామేశ్వర్రెడ్డి, మల్లికార్జున్ స్వామి, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, మహేశ్, తిరుపతి, స్వప్న, శారదాదేవి, శ్రీలక్ష్మి, బాలుర పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
తంగళ్లపల్లి మండలం పద్మనగర్లోని కేజీబీవీ, ఓబులాపూర్, సిరిసిల్ల పట్టణంలోని శుభోదయ పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేజీబీవీ ఎస్వో శ్యామల, ఓబులాపూర్ పాఠశాల హెచ్ఎం ఉపేందర్, శుభోదయ పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్తోపాటు సర్పంచ్ ముడారి పోచయ్య, ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థులు ఉన్నారు.
కొదురుపాక జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, హెచ్ఎం, డీఈవోల పాత్రలు పోషించారు. రిటైర్డ్ టీచర్ కొంకటి బాలకిషన్ తన భార్య సుభద్ర జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లేని పది మంది పిల్లలకు రూ. వెయ్యి చొప్పున అందించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
మండలంలోని కోనరావుపేట, ధర్మారం, నిజామాబాద్, కనగర్తి ప్రభుత్వ పాఠశాలల్లో స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్ఎంలు శారద, సత్తు రవీందర్, ఉపాధ్యాయుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.