తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మధురానగర్లో పీఎం దిష్టిబొమ్మ దహనం
గంగాధర, ఫిబ్రవరి 9: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పేందుకు కేంద్రంపై బరిగీసి కొట్లాడుతామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తేల్చిచెప్పారు. బుధవారం మధురానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు ధరించి ‘బీజేపీ డౌన్డౌన్.. పీఎం క్షమాపణ చెప్పాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ విభజన అసంబద్ధమంటూ మాట్లాడిన ప్రధాని బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. నాలుగుకోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఆయనకు తెలంగాణ ప్రజానీకం తగిన సమయంలో బుద్ధి చెబుతుందన్నారు. తెలంగాణ ఎంపీలకు ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉంటే వెంటనే తమ పదవులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కొండగట్టు ఆలయ డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, మాల చంద్రయ్య, రాసూరి మల్లేశం, ఎండీ నజీర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు అంజి, తిరుపతి, రమేశ్, ఆదిమల్లు, ఆంజనేయులు, అనిల్, మధుసూదన్, శ్రీనివాస్రెడ్డి, నగేశ్, అజయ్, ప్రభాకర్, సంపత్, రవి, అఖిల్, వినోద్ పాల్గొన్నారు.