మానకొండూర్, ఫిబ్రవరి 1: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గ సభ్యుల పాత్ర కీలకమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. మానకొండూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పదవీ కాలం పూర్తయిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ శేఖర్గౌడ్, సర్పంచ్ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ మురళి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చొప్పదండి(రామడుగు)/శంకరపట్నం/చిగురుమామిడి/వీణవంక/కొత్తపల్లి, ఫిబ్రవరి 1: రామడుగు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కవిత ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులను సన్మానించారు. రామడుగు విండో చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ గోపాల్, మారెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీపీ కిష్టారెడ్డి, ఎంపీడీవో భాసర్ రావు, ఎంపీవోవో రాజశేఖర్ రెడ్డి, ఏపీవో రాధ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి మండలం కాట్నపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, అధికారులను గ్రామస్తులు సన్మానించారు. సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తార, కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సరోజన ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచుల ఫోరం చైర్మన్ సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం రేకొండ, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సన్మానించారు.
ఎంపీపీ వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ రవీందర్, సర్పంచులు రజిత, వెంకటేశం, ఎంపీటీసీ సంధ్య, మిలీనియం యూత్ క్లబ్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వీణవంక మండలంలో కనపర్తిలో సర్పంచ్ పర్లపెల్లి రమేశ్, పాలకవర్గాన్ని సన్మానించారు. ఉపసర్పంచ్ దేవేందర్రెడ్డి, కార్యదర్శి, ఎంపీటీసీ స్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్ సర్పంచ్ ఇల్లందుల రాజమ్మను వార్డు సభ్యులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
వార్డు సభ్యులు సోమినేని రమ్యశ్రీ-తిరుపతి, పురుషోత్తం శ్రీనివాస్, పురుషోత్తం అంజి లాస్య, పురుషోత్తం శ్రీనివాస్, అంజలి, ఆల్గొండ అంజి-కవిత, భూమేశ్, మసట్ అంజయ్య, నాయకులు శేఖర్రావు, రాజశేఖర్, కార్యదర్శి శ్రావణ్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 1: ప్రజాప్రతినిధులకు జీవితాంతం ప్రజా సేవ చేసే అవకాశం ఉందని ఆర్డీవో మహేశ్ పేర్కొన్నారు. మొగ్దుంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులకు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై సన్మానించారు. పంచాయతీ కార్యదర్శి సల్మాన్ఖాన్, కారోబార్ లక్ష్మారెడ్డి, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.