కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 22 : అత్యాధునిక ఫీచర్స్తో ఉన్న ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ఎదురుచూస్తున్నారా..? ఒకే దగ్గర వాటి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా.. కరీంనగర్లో షోరూం లు లేవు, ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే, మీలాంటి వారి కోసమే ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీంనగర్లో మెగా ఆటో షో నిర్వహిస్తున్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానం (సర్కస్గ్రౌండ్) వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహించే ఈ ఎక్స్పోను నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించిన ఈ షోలో ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కంపెనీలతోపాటు రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పాల్గొంటున్నాయి. మొదటిసారిగా ప్రపంచ స్థాయిలో కార్ల కంపెనీలు ఈ షోలో భాగస్వామ్యమవుతున్నాయి. ఒకే వేదికపై తమ సరికొత్త మోడళ్లను ప్రదర్శించనున్నాయి.
ఇప్పటి వరకు నగరంలో షోరూంలు లేని మెర్సిడిస్ బెంజ్, ఆడి, వోల్వో, కార్లతోపాటు టయోటా కంపెనీలు కూడా తమ స్టాళ్లలో వాహనాల ఫీచర్స్ను వివరించనున్నాయి. సుమారు 20కి పైగా కార్ల కంపెనీలతోపాటు బైక్లు, ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దీంతో సందర్శకులు ఒకే చోట వాహనాలకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ షోకు మెయిన్ స్పాన్సర్ ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్లుగా మహవీర్ గ్రూప్ మెర్సిడిస్ బెంజ్, ఆడి హైదరాబాద్, వోల్వో, మహవీర్ ఐసుజు, ప్రైడ్ జీప్, గ్రీన్ హోండా, మోటార్ లైన్ మహీంద్ర డీలర్, క్వాంటం ఈ-స్కూటర్స్, కాకతీయ టయోటా, మారుతి సుజుకి, నెక్సా, మారుతి సుజుకి ఎరీన, ఆదర్శ ట్రూ వాల్యూ, మాలిక్ కియా, హైరా సుజుకి సంస్థలతోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలు పాల్గొంటున్నాయి.