వీణవంక, మార్చి 27: కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ మంచిగ ఉండడం వల్ల మోటర్లు కాలక పోయేది. కానీ, మొన్నటి సంది మోటర్లు చాలా కాలిపోయి రిపేర్కు వస్తున్నయని వీణవంకకు చెందిన వైండింగ్ షాప్ యజమాని శ్రీనివాస్ పేర్కొన్నాడు. వీణవంకలో ఓ కార్యక్రమానికి కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరై, తిరుగుపయనంలో బస్టాండ్ సమీపంలో షాపులో మోటర్ వైండింగ్ చేస్తున్న శ్రీనివాస్ను చూసి ఆగారు.
అక్కడకు వెళ్లి మాట్లాడారు. గతంలో మోటర్లు ఎన్ని కాలేది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కాలుతూ రిపేర్కు వస్తున్నయ్? అని అడుగగా, శ్రీనివాస్పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.