జగిత్యాల రూరల్, నవంబర్ 20: అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన రిట్రో పిట్టెడ్ మోటార్ వాహనాల (మూడు చక్రాల స్కూటీలు)ను 40మంది దివ్యాంగులకు అందజేసి, మాట్లాడారు. ది వ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నదని, అన్నింటా పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు బడ్జెట్లో దివ్యాంగులకు రూ.5కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ స్వరాష్ట్రంలో 10రేట్లు పెంచి రూ.60కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్న దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం రూ.950 మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. దివ్యాంగుల కమిటీల నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని, కమిటీల సభ్యు లు 25 సమస్యలను తన దృష్టికి తెచ్చారన్నారు. సీఎం, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి దివ్యాంగుల దినోత్సవంలోపు పరిష్కరిస్తానని చెప్పారు. దివ్యాంగుల శాఖ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్నదని, సీఎం మాట్లాడి దివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. 92వ యాక్టును పటిష్టంగా అమలు చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఆశీర్వాదం ఉండాలన్నారు. డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామన్నారు. గతంలో ట్రై సైకిల్ మాత్రమే ఉండేవని, జిల్లాలో బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అయితే బ్యాటరీ సైకిళ్ల మరమ్మతుల కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికో సం ప్రతి జిల్లా కేంద్రంలో రిపేర్ సెంటర్ను ఏ ర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో బ్యాటరీ సైకిళ్లను పీజీ ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారని, ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రస్తుతం స్కూటీలను డిగ్రీ ఉన్న వారికి సైతం అందజేస్తామన్నా రు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థలు మాత్రమే పరికరాలు అందజేసేవని, కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వమే వినికిడి మిషన్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కూటీ లు అందజేస్తున్నదని చెప్పారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ ది వ్యాంగులు భగవంతుని స్వరూపాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నా రు. కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రికి దివ్యాంగుల శాఖ ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి అదనంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. గతంలో 500 మందికి బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశామని, ఇవి వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోడపడుతున్నాయని, ఈ క్రమంలో త్వరలోనే మరో 200 ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాళ్లు బోగ శ్రావణి, సంగి సత్తమ్మ, ఆర్డీవో మాధురి, జడ్పీటీసీలు సుధారాణి, రా జేందర్, భూమయ్య, ఎంపీపీలు రాజేంద్ర ప్ర సాద్, రాజమణి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మ న్ అయ్యోరి రాజేశ్, కౌన్సిలర్ చుక్క నవీన్, ది వ్యాంగుల రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి సత్యం, డీడబ్ల్యూవో నరేష్ ఉన్నారు.