కార్పొరేషన్/ రామడుగు/ శంకరప్నటం, సెప్టెంబర్ 24: బతుకమ్మ పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ముచ్చటగా ఆరోసారి అందిస్తున్నది. కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో తీరొక్క వర్ణాలు, డిజైన్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరెలను, కులమతాలకతీతంగా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ మూడురోజులుగా పంపిణీ చేస్తుండగా, ఊరూరా పండుగలా సాగుతున్నది. శనివారం గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ చీరలను అందజేశారు.
జగిత్యాల పట్టణంలోని సుభి గార్డెన్స్లో పట్టణంలోని 28,29,41,42 వార్డులకు చెందిన ఆడబిడ్డలకు అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. రామడుగు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 33, 11వడివిజన్లలో మేయర్ సునీల్రావు అందజేశారు. ఓదెల మండలంలోని 22గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పర్యటించి లబ్ధిదారులకు నేరుగా అందజేశారు.