గొల్లపల్లి, సెప్టెంబర్ 24: పచ్చని తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నదని, ఆ పార్టీ మాయలో పడొద్దని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇన్నేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఏ ఒక్క కొత్త పథకాన్ని తీసుకురాకపోగా, జీఎస్టీతో ప్రజలను, చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. శనివారం గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్లో బతుకమ్మ చీరలు పంపిణీని ప్రారంభించి, మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లో వృద్ధాప్య, దివ్యాంగుల పెన్ష న్లు మాత్రమే ఇస్తుండగా తెలంగాణలో మాత్రం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, బోధకాలు, డయాలసిస్ బాధితులకు సైతం పెన్షన్లు ఇస్తున్న ఘతన కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. దేశంలో వృద్ధులకు 2016, ది వ్యాంగులకు 3,016 ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రా ష్ర్టాల్లో ఇస్తున్నారా..? ఆపార్టీ నేతలు చెప్పాలని ప్ర శ్నించారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రాణం పోయినా పెట్టనిచ్చేది లేదని సీఎం కేసీఆర్ పోరాడుతున్నట్లు వివరించారు. బతుకు బతికించు అనే లక్ష్యంతో రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతున్నదని బతుకమ్మ చీరలతో పేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపడంతో పాటు ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పిస్తున్నట్లు చెప్పా రు. ఎనిమిదేండ్ల క్రితం సాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డ రైతులు స్వరాష్ట్ర పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 30లక్షల ఎకరాల్లో ఉన్న వ్యవసాయ సాగు ఇప్పుడు 1.35కోట్ల ఎకరాలకు చేరిందన్నారు. సా గునీటి ప్రాజెక్టు నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జలందర్, సర్పంచ్ గంగారెడ్డి, ప్యాక్స్ అధ్యక్షుడు మాధవ రావు, వైస్ ఎంపీపీ సత్తయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గంగాధర్, ఎంపీటీసీ ధనవ్వ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, యూత్ అధ్యక్షుడు రవీందర్, పాల్గొన్నారు.