గంభీరావుపేట, నవంబర్ 28:ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంప్యూటర్ ఇనిస్టిట్యూటో లేదా సాప్ట్వేర్ కంపెనీ అని అనుకుంటున్నారా..? కానే కాదు, ఇది గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్! పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కంప్యూటర్ విద్యను అందించాలనే మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటైంది. గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్కు 35 కంప్యూటర్లతో ల్యాబ్ను సిద్ధం చేయగా, త్వరలో మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించనున్నారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.