చొప్పదండి, అక్టోబర్ 4: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రోజురోజుకూ పార్టీ బలం పెరుగుతున్నదని, వివిధ పార్టీల నాయకులంతా పార్టీవైపే చూస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కనుమరుగు కావడం ఖాయమని, రాష్ట్రంలో మిగిలేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. మల్లన్నపల్లికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్కుమార్కు గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీలో చేరుతున్నారని, పార్టీ ఎదురు లేదని ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని వివరించారు. ఇక్కడ నాయకులు గోవులకొండ శ్రీనివాస్ ఉన్నారు.