కమాన్చౌరస్తా, ఆగస్టు 18: జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్ లో విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి వేడుకలను ప్రారంభించారు. సుమారు 300 మంది విద్యార్థులు చిన్నికృష్ణుడు, గోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు.
మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో వేడుకలను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్రావు ప్రారంభించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపిక వేషధారణలో సందడి చేశారు. అనంతరం ఉట్టి వేడుకలు నిర్వహించారు. విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, రాకేశ్, రశ్మిత, అనుకర్రావు, వినోద్రావు, ప్రపాద్, హనుమంతరావు పాల్గొన్నారు.
మంకమ్మతోట, భగత్నగర్లోని సిద్ధార్థ పాఠశాలల్లో ఉట్టి వేడుకలు నిర్వహించారు. విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీపాల్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
బోయవాడ శ్రీచైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు కృష్ణుడు, గోపిక వేషధారణలతో హాజరై ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఉట్టి వేడుక నిర్వహించారు. ప్రిన్సిపాల్ కిరణ్కుమార్రెడ్డి, డీజీఎం జీఎల్ఆర్, ఆర్ఐ రాజు, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి గురు ప్రీత్కౌర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భగత్నగర్లోని భగవతి విద్యాసంస్థలు, హనుమాన్నగర్లోని ఆర్విన్ట్రీ విద్యాసంస్థల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ బీ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని బ్రాహ్మణవీధిలోని నారాయణ హైస్కూల్లో వేడుకలు నిర్వహించగా విద్యాసంస్థల జీఎం గోపాల్రెడ్డి, ఏజీఎం చైతన్యరావు, ప్రిన్సిపాల్ భాస్కర్రెడ్డి, ప్రీప్రైమరీ కోఆర్డినేటర్ రవళీప్రియ, ఆర్ఐ షేక్ రహీం, శిరీష, రమేశ్, సతీశ్ పాల్గొన్నారు. గణేశ్నగర్లోని ఒడిస్సీ పాఠశాలలో వేడుకలు నిర్వహించగా పాఠశాల చైర్మన్ సుధాంశ్ రెడ్డి, డైరెక్టర్ మనీశ్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ రేగులపాటి సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.