చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
చొప్పదండి, మార్చి 21: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 19 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 5 లక్షల 32 వేల విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడక ముందు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందక నిరుపేదలు దవాఖానల్లో చికిత్స పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్పై భరోసాతో కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావన్కుమార్, సర్పంచ్ లావణ్య, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, బీసవేని రాజశేఖర్గౌడ్, మావురం మహేశ్, రాములు, రాజేశం, కొండయ్య, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఔదార్యం
చొప్పదండి, మార్చి 21: మండలంలోని దేశాయ్పేటలో నిరుపేద పల్లె నర్సింహస్వామి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అతని కుమారుడు హర్ష (16 నెలలు) ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామ యువకులు సేకరించిన రూ.80 వేలతో పాటు ఎమ్మెల్యే రూ.20 వేలు కలిపి మొత్తం రూ. లక్ష బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాలుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హర్షకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఫోన్లో సూచించారు. చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటరెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, పాకాల మహేశ్, ఒడ్నాల మహిపాల్, మల్లేశం, కొత్తూరి మహేశ్, మహేశ్, రాజశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.