కార్యకర్తలకు అండగా ఉంటా
టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
జగిత్యాలో అభినందన సభకు హాజరు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 2 : కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని, తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ముందుంటానని టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ జిల్లా సారథిగా నియామకమైన అనంతరం మొదటిసారి జగిత్యాలకు వచ్చిన కల్వకుంట్ల వి ద్యాసాగర్ రావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్ర మాణ స్వీకారం చేసి మొదటిసారి జగిత్యాలకు వ చ్చిన ఎల్ రమణకు బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర మం త్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు తీరును వివిధ దేశాల నుంచి వచ్చి పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రె స్ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కొండగట్టు అంజన్నను మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రుణపడి ఉంటా : ఎమ్మెల్సీ ఎల్ రమణ
ఎమ్మెల్సీగా తన గెలుపునకు కృషి చేసిన స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొ న్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజాప్రతినిధుల వెన్నంటి ఉంటూ జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడతానన్నారు. చొప్పదండి నుంచి జగిత్యాల వరకు భారీ ర్యాలీ చేపట్టి తనకు ఘన స్వాగతం పలకడాన్ని జీవితాంతం మరువలేనన్నారు.
సీఎం కు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే సంజయ్
టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావును నియమించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అనుభవం గల నాయకుడని, జగిత్యాల నియోజక వర్గం పక్షాన జిల్లా అధ్యక్షుడి వెన్నంటి ఉంటామని, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను జిల్లాలో ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేస్తారన్నారు.
అభినందనీయం : జడ్పీ చైర్పర్సన్
ఎంతో అనుభవమున్న ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అని, ఆయనను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం అభినందనీయమని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. బీజేపీ పేద ప్రజల కడుపుకొట్టే పార్టీ అని, నల్ల చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు.
దేశంలోనే ఏకైక పార్టీ : ఎమ్మెల్యే సుంకె
60లక్షల సభ్యత్వాలు కలిగి ఉన్న దేశంలోనే ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కార్యకర్తలకు రూ.2లక్షల ప్రమాదబీమా కల్పిస్తూ భరో సా ఇస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉపాధి కోసం ముంబై, బీవండి వంటి నగరాలకు వలస వెళ్లేవారని, రాష్ట్రం అవతరించిన తర్వాత ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారన్నారు.
ఘన స్వాగతం
ఎమ్మెల్సీ ఎల్ రమణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించారు. టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ధరూర్ నుంచి భారీ ర్యాలీ తీశారు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ ర్యాలీ టవర్ సర్కిల్, తహసీల్ చౌరస్తా మీదుగా పద్మనాయక కల్యాణ మండపం వరకు సాగింది. అనంతరం టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు.