కమాన్చౌరస్తా, డిసెంబర్ 25 : కమర్షియల్ సినిమాలు కాకుండా సమాంతర సినిమాలు ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ 45 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నదని కఫిసొ శాశ్వత సభ్యుడు గంగారావు పేర్కొన్నారు. ఆదివారం ఫిల్మ్ భవన్లో జరిగిన 45వ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఔత్సాహిక సినీ, టీవీ కళాకారులను ప్రోత్సహిచేందుకు చిన్నతెర ద్వారా లఘు చిత్రాలను ప్రదర్శించడం అభినందనీయమని కొనియాడారు.
కఫిఫొ సలహాదారుడు వరాల మహేశ్ మాట్లాడతూ సంస్థ మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2022వ సంవత్సరానికి కార్యదర్శి, కోశాధికారి సమర్పించిన నివేదికలను ఆమోదించి, 2023 సంవత్సరానికి నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా పొన్నం రవిచంద్ర, గౌతమ్
2023 సంవత్సరానికి కరీంనగర్ ఫిలిం సొసైటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పొన్నం రవిచంద్ర, కార్యదర్శిగా కే లక్ష్మీగౌతమ్, కోశాధికారిగా చెన్న అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజాఫర్, సంయుక్త కార్యదర్శులుగా కొమురవెళ్లి వెంకటేశం, టీ దశరథం, కార్యవర్గ సభ్యులుగా మాడిశెట్టి గోపాల్, ఆర్ వెంకటేశ్వరరావు, మునిపల్లి ఫణిత, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య, నార్ల చంద్రమౌళి, రుద్ర శంకరయ్య, ఓ రఘురాం, ఇనుగుర్తి రమేశ్, లక్ష్మణ్కుమార్, టీ అశోక్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా గంగారావు, కఫిసొ సలహాదారులు వరాల మహేశ్ వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గం సమావేశమై 2023లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.