తెలంగాణచౌక్, నవంబర్ 28: బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లమ లింగమూర్తి పటేల్ పేర్కొన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని నగరలో జ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో అజయ్పటేల్, కుమార్, శివ పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ప్రజలకు విద్యాబోధన చేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అశయాలను కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని సంఘ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేశ్, హేమంత్, మారుతి, హరి తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి
మహాత్మా జ్యోతిబా ఫూలే 132వ వర్ధంతిని మండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, మాజీ ఎంపీటీసీ తోడేటి రత్నం, టీ(బీ)ఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు సదానందం, నాయకులు మహేశుని మల్లేశం, పెరుమాండ్ల గంగయ్య, కొత్తూరి నరేశ్, చెట్టిపల్లి పద్మ, కడారి రాజలింగం, చల కృష్ణ, ప్రసాద్, భీంరాజ్, హరీశ్, ప్రశాంత్, అనిల్, కొమురయ్య, అమరేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్లో జ్యోతిబాఫూలే వర్ధంతి
మహాత్మా జోతిబాఫూలే వర్ధంతిని పురసరించుకొని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.