జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 13: అక్రమ వడ్డీ వ్యాపారులపై జగిత్యాల జిల్లా పోలీసులు కొరఢా ఝులిపించారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం జగి త్యాల, జగిత్యాల రూరల్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్ర హీంపట్నం, మల్యాల, ధర్మపురి, రాయికల్, గొల్లపల్లి ఠాణాల పరిధిలో సోదాలు చేశారు.
పలువురి ఇండ్లలో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో రూ.30,82, 020 నగ దు, రూ.4,45,21,800 విలువైన బాండ్ పేపర్లు, ప్రా మిసరీ నోట్లు, చెక్కులు, సుమారు కిలోన్నర బంగారు నగలు, రూ.2.50లక్షల విలువైన మార్ట్గేజ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.