జగిత్యాల, మార్చి 24: జిల్లా కేంద్రంలోని జగిత్యాల పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 17 మంది పేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్స చేశారు.
ఆదివారం ఉదయం రోగుల కండ్ల ను పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకుడు ఆనంద్రావు, దవాఖాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు