మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంపై మంత్రి కేటీఆర్ ఇటీవల వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. గత నెల ఒకటిన పర్యటించిన ఆయన చందర్ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన విషయం విదితమే. అయితే ఎన్నికల వేల అమాత్యుడి హామీపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో కొత్తరూపు సంతరించుకున్న ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు, కార్మికులు భావిస్తున్నారు. వారం క్రితం రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాశ్రావు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రెండోసారి ఎమ్మెల్యేగా చందర్ను గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు.
గోదావరిఖని, నవంబర్ 1 : రాష్ట్రం రాకముందు రామగుండం అభివృద్ధికి దూరమైంది. మాంచెస్టర్ ఇండియాగా పేరు సాధించినా.. ప్రగతి జాడ లేక ఆగమైంది. కనీస సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఇలా ఎన్నో పరిశ్రమలు ఉన్నా గత ప్రభుత్వాలు కనీస వసతులు కల్పించలేదు. ఈ ప్రాంత ప్రజానీకం ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మిక క్షేత్రంపై ప్రత్యేక ప్రేమను చూపారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యానికి విరివిగా నిధులు ఇచ్చారు. కోలిండియాకు దీటుగా సింగరేణి అభివృద్ధికి అంకురార్పణ చేశారు. కాంగ్రెస్ పాలనలో కనుమరుగైన కారుణ్య నియామకాలను పునరుద్ధరించారు. గనిబిడ్డలకు లాభాల్లో 32 శాతం వాటా చెల్లించారు. పండుగల అడ్వాన్స్ను పెంచారు. సింగరేణి క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించారు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చారు. 500 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ను అందుబాటులోకి తెచ్చారు. 36 కోట్లతో కోర్టు సముదాయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గోదావరిఖనిలో టీ పార్కు, అంతర్గాంలో ఇండస్ట్రీయల్ పార్కుకు పునాది వేశారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం అభివృద్ధి పథంలో సాగిపోతున్నది. ఈ నేపథ్యంలో గత నెల ఒకటిన గోదావరిఖనిలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఐటీ పార్క్, ఇండస్ట్రీయల్ పార్కులకు శంకుస్థాపన చేశారు.అదే రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తే.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ సూచనమేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమాత్యుడి ప్రకటనతో కార్మిక క్షేత్రంలోని ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు. సబ్బండ జనులు రామన్న నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 27న గోదావరిఖనిలో మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాశ్రావు సైతం తన అభిప్రాయాన్ని చెప్పారు. కేటీఆర్ దత్తతతో రామగుండం నియోజకవర్గానికి మహర్దశ పడుతుందని పేర్కొన్నారు.
రామగుండం తెలంగాణ వచ్చిన తర్వాత గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడం సంతోషకరం. రామంగుండం వాసిగా మంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక్కడి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజల్లో ఉండేవ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజాభిమానాన్ని పొందా రు. ఉద్యమకారుడిగా, కార్మికుడి కొడుకుగా ఆయన ఇక్కడి ప్రజల కష్టాల్లో అండగా నిలబడ్డారు. ఆయనకు మంత్రి కేటీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలువడం, కేసీఆర్ లేదంటే కేటీఆర్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆయనకు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ ఉన్నది. ప్రజలు బాగా ఆలోచించి కోరుకంటి చందర్ను గెలిపించాలి. లేదంటే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంటది.
– గోనె ప్రకాశ్రావు( రాజకీయ విశ్లేషకుడు)
ఇటీవల గోదావరిఖనికి వచ్చిన కేటీఆర్ దత్తత ప్రకటన తనకు ఎంతో సంతోషానికి గురిచేసింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంపై లేని ప్రత్యేక శ్రద్ధను ఆయన రామగుండంపై చూపడం అదృష్టం. సింగరేణి కార్మికులన్న, ఇక్కడి ప్రజలన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎనలేని ప్రేమ. ఈ కారణంగానే సీఎం సింగరేణి కార్మికులకు కోలిండియాలో లేని అనేక హక్కులు కల్పించారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీ సు ఏర్పాటు చేశారు. కోర్టు భవనాలకు రూ. 38 కోట్లు కేటాయిం చారు. ఐటీ పార్కు, అంతర్గాం లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం ప్రజలు తనను గెలిపిస్తే రామగుండానికి ఒక ఎమ్మెల్యే ఉండడని, మరో ఎమ్మెల్యే కేటీఆర్ ఈ ప్రాంతంను దత్తత తీసుకొని ఆయన మరో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారు.
– కోరుకంటి చందర్ (రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి)
రామగుండం నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటానని ప్రకటించడం సంతోషం. తొమ్మిదేండ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధించింది. రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పనితీరు సంతృప్తిగా ఉంది. ఆశించిన దాని కంటే ఎక్కువే చేశారు. ఆయన్ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామగుండం దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించడం శుభ పరిమాణం. ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధిని కాంక్షించేవారిని గెలిపిస్తేనే మేలు జరుగుతుంది. పర్యాటకంగా మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది.
– మేడ చక్రపాణి, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
కొంత కాలంగా రామగుండం అభివృద్ధి పథంలో సాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ను గెలిపిస్తే ప్రాంతంను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బసంత్ నగర్ విమానశ్రయం, రామగుండం మణుగూరు రైల్వే లైను ఏర్పాటు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజలు ఆలోచించి ఓటేయాలి..
– దాదాసలాం, రిటైర్డ్ ప్రిన్సిపాల్, న్యాయవాది
రామగుండం నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే కార్మికులకు కోలిండియాలో లేని అనేక హక్కులను కల్పించారు. తక్కువ పెన్షన్ పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం నుంచి కూడా పెన్షన్ వచ్చే విధంగా చేశారు. రామగుండం నుంచి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ను గెలిపిస్తే ఏలాంటి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవాలి. దీంతో రామగుండం ప్రగతి పథంలో దూసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– గంట సత్తయ్య, సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శి