జగిత్యాల : పట్టణంలోని శారదా విద్యా నిలయం ( Sharadha Vidya Nilayam ) పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (Alumni Reunion) ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాటి సహపాఠులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం , హెడ్మాస్టర్ పునుగోటి నీరజాకుమారి రంగారావు ( HM Ranga rao ) పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, గురువుల మార్గదర్శకత తమ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. దాదాపు 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దీనస్థితిలో , ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సహచర మిత్రులకు సహాయ, సహకారాలు అందించాలని నిర్ణయించారు.