చిగురుమామిడి, జనవరి 4: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు అద్భుతమని, చాలా గొప్పగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిషరణలో ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి పనిచేస్తానని, సహకరిస్తానని చెప్పారు.
ప్రభు త్వ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఉన్నారని, ప్రతి ఎకరాకు నీరందించి సాగును సస్యశ్యామలం చేయడంతో ఈ రోజు ఏ ఊళ్లో చూసినా రైతులు సంబురపడుతున్నారన్నారు. చిగురుమామిడి మండలంతో తనకు విడదీయరాని బంధం ఉందని, గత పాలకులకు భిన్నంగా ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పారు. అనంతరం సతీశ్కుమార్, చాడ ఇద్దరూ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించుకున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి వెంకటరెడ్డి అడిగి తెలుసుకున్నారు.