గంగాధర, ఆగస్టు 4 : గట్టుభూత్కూర్లోని పురాతన బురుజు సరికొత్త శోభను సంతరించుకున్నది. శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడానికి స్థానిక సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి మరమ్మతులు చేయించి జాతీయ జెండా ఆకారంలో రంగులు వేయించగా, ఎంతో ఆకట్టుకుంటున్నది.
వజ్రోత్సవాల నేపథ్యంలో ఇప్పటి నుంచే బురుజు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. స్థానిక యువత వాట్సాప్ స్టేటస్గా, డీపీగా పెట్టుకొని జాతీయతా భావాన్ని చాటుకుంటున్నది.