మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మెట్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రూ. 2.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందులో సత్తక్కపల్లిలో రూ. 10 లక్షలు, చెర్లకొండాపూర్లో రూ. 10 లక్షలు, రాజేశ్వర్రావుపేటలో రూ. 10 లక్షలు, విట్టంపేటలో రూ. 15 లక్షలు, మెట్లచిట్టాపూర్లో రూ. 35 లక్షలు, రంగారావుపేటలో రూ. 10 లక్షలు, కేసీఆర్ తండాలో రూ. 5 లక్షలు, ఆత్మకూర్లో రూ. 20 లక్షలు, పాటిమీది తండాలో రూ. 5 లక్షలు, జగ్గసాగర్లో రూ. 20 లక్షలు, కొండ్రికర్లలో రూ. 20 లక్షలు, కోనరావుపేటలో రూ. 20 లక్షలు, రామారావుపల్లెలో రూ. 10 లక్షలు, పెద్దాపూర్లో రూ. 15 లక్షలు, చౌలమద్దిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టనున్నారు.
అలాగే రూ. 20 లక్షల చొప్పున రూ. 1.80 కోట్లతో సత్తక్కపల్లి, విట్టంపేట, కేసీఆర్ తండా, పాటిమీది తండా, ఆత్మకూర్, కొండ్రికర్ల, కోనరావుపేట, రామారావుపల్లె, పెద్దాపూర్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఓవైపు అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూనే మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిలా మార్చారని కొనియాడారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మండలంలోని పలు గ్రామాల్లో రూ. 18,02,088 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఎమ్మెల్యే విద్యాసాగర్రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మేడిపల్లిలో నలుగురు, రాజేశ్వర్రావుపేటలో ఇద్దరు, చెర్లకొండాపూర్లో ఒకరు, మెట్లచిట్టాపూర్లో ఒకరు, జగ్గసాగర్లో ఐదుగురు, ఆత్మకూర్లో ఇద్దరు, కొండ్రికర్లలో ఇద్దరు, చౌలమద్దిలో ఒక లబ్ధిదారుకు చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు లక్ష్మి, శ్రీధర్, సత్యనారాయణ, ఆకుల రాజరెడ్డి, బద్దం శేఖర్రెడ్డి, గంగు, శంకర్నాయక్, సుగుణ, చౌట్పల్లి లావణ్య, బుజ్జి, రాజగంగు, శ్యామల, లక్ష్మి, రవి, గడ్డం లింగారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, ఎంపీటీసీలు నోముల గంగాధర్, సదిరం లక్ష్మి, తుమ్మల పుష్ప, శంకరయ్య, సహకార సంఘాల అధ్యక్షులు కేసిరెడ్డి నవీన్రెడ్డి, తీగల లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల సమన్వయకర్త గడ్డం రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం రాజరెడ్డి, పార్టీ బీసీ సెల్ మండలాధ్యక్షుడు మెండె రమేశ్, నాయకులు సదిరం గంగాధర్, చౌట్పల్లి అంజయ్య, పుల్ల జగన్గౌడ్, గొర్రె పుష్ప తదితరులు పాల్గొన్నారు.