గంగాధర, ఫిబ్రవరి 3: క్రీడలతో మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్లో ఉమ్మడి జిల్లా స్థాయి ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం ఫైనల్ పోటీలు నిర్వహించగా, గంగాధర జట్టు విజేతగా, అన్నారం జట్టు రన్నరప్గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, ఎండీ నజీర్, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మీరాజం, నాయకులు వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, ముద్దం నగేశ్, వడ్లూరి ఆదిమల్లు, సముద్రాల అజయ్, ఎగుర్ల మల్లయ్య, నిమ్మనవేణి ప్రభాకర్, సామంతుల శ్రీనివాస్, మ్యాక వినోద్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.