కరీంనగర్ జిల్లాకేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో అదిరింది. ఈ ఎక్స్పో రెండు రోజులపాటు కొనసాగనుండగా, మొదటి రోజు శుక్రవారం విశేష స్పందన లభించింది. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్ వందలాది మందితో కిటకిటలాడింది. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతోపాటు బ్యాంకులు పాల్గొనగా, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాళ్ల వద్దకు వెళ్లి వెంచర్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు బ్యాంకు రుణాలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్ వేదికగా రెండు రోజుల ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. మొదటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ వినోద్ కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఎక్స్పోను ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను ఓపెన్ చేయడంతోపాటు ఆయా సంస్థల వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్కు చెందిన పలు ప్రముఖ సంస్థలతోపాటు జిల్లాకు చెందిన వివిధ రియల్ సంస్థలు, బిల్డర్స్తో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన సోలార్ సంస్థలు, సిమెంట్, వుడ్కు సంబంధించిన సంస్థలు, నిర్మాణాలకు రుణాలు అందించే బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనగా, షోను తిలకించేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ప్రతి స్టాల్కు వెళ్లి వెంచర్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయా సంస్థల్లో కొనుగోలు చేస్తే అందించే సదుపాయాలు, ఆధునిక సౌకర్యాల వివరాలను తెలుసుకున్నారు. వీటితో పాటు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు, వాటికి సమర్పించాల్సిన వివిధ డాక్యుమెంట్ల వివరాలను సేకరించారు. కొందరు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఆసక్తిగా పరిశీలించారు. నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఇతర సంస్థల స్టాళ్ల నుంచి ఆయా పనులకు అయ్యే వ్యయ వివరాలను తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో స్టాల్స్ అన్నీ కిక్కిరిసిపోగా, రెవెన్యూ గార్డెన్ ప్రాంతమంతా సందడిగా మారింది.
నగరానికి చెందిన ప్రముఖులు, నాయకులు, రియల్ ఏజెంట్లు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదటి రోజు ప్రతి రెండు గంటలకోసారి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందించారు. కాగా, మొదటి రోజు షోకు మంచి స్పందన వచ్చిందని, రెండో రోజు శనివారం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో ఇలాంటి ప్రాపర్టీ షో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని, ఇండ్లు, అపార్టుమెంట్లు, ప్లాట్లు, గృహ రుణాల గురించి ఒకే చోట తెలుసుకునే అవకాశం ఏర్పడిందని సందర్శకులు చెబుతున్నారు. ఇలాంటి వేదికలు అప్పుడప్పుడు ఏర్పాటు చేయాలని కోరారు.
నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోకు మంచి ఆదరణ ఉన్నది. అందులో ఉస్మానీ కన్స్ట్రక్షన్స్ స్టాల్ ద్వారా మేం అందిస్తున్న సేవలను వివరిస్తున్నాం. మేం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నాం. నగర శివార్లలో అనువైన స్థలాలు, విశాలమైన రోడ్లతో నిర్మాణాలు చేపడుతున్నాం. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ ఉన్నది.
– సాద్ ఉస్మాని, సివిల్ ఇంజినీర్ (ఉస్మానీ కన్స్ట్రక్షన్స్)
రాయిచందని సింధ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక ప్రమాణాలతో అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నాం. మా నిర్మాణాలు ప్రస్తుతం నగరంలో మూడు ప్రాంతాల్లో విస్తరించాయి. మల్కాపూర్లో ఆరున్నర ఎకరాల్లో 73 విల్లాలు, అందులో జీ ప్లస్-1 63, జీ ప్లస్-2లో 10 నిర్మాణాలు జరుగుతున్నాయి. కస్టమర్లకు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, పార్టీ హాల్, లైబ్రరీ తదితర వసతులతో నిర్మించి ఇస్తున్నాం. ఇవి శాతవాహన యూనివర్సిటీ, స్కూళ్లు, కాలేజీలకు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఈ విల్లాలను కస్టమర్లకు ఏప్రిల్లో అందిస్తాం. అలాగే నగునూర్ ప్రతిమ హాస్పిటల్ ఎదుట సిల్వర్ స్ప్రింగ్ పేరిట మూడెకరాల్లో 41 విల్లాలను నిర్మిస్తున్నాం.
అందులో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, పార్టీ హాల్, ఆట స్థలం, గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. అలకాపురి కాలనీలో నూతన డీమార్ట్ ఎదుట శారద హోమ్స్ అపార్ట్మెంట్లో 25 ప్లాట్స్ (2 బీహెచ్కే) నిర్మాణం పూర్తయింది. ఈ అపార్ట్మెంట్ కరీంనగర్ టూ హైదరాబాద్ హైవే, ఐటీ టవర్, సిరిసిల్ల బైపాస్రోడ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. మా సంస్థ నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) అనుమతులతో చేపట్టాం. అలాగే, మా సంస్థ వేములవాడ నంది విగ్రహం నుంచి సిరిసిల్ల వెళ్లే రోడ్డులో 12 ఎకరాల సువిశాలమైన కమర్షియల్, రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. – వినీత్ మోత్వాని, రాయిచందని సింధ్ డెవలపర్స్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా ప్రాజెక్టుల వివరాలను అందరికీ తెలుపుతున్నాం. సందర్శకులు మా నాణ్యమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
– మహేందర్, వేకా యూపీసీ స్మార్ట్ విండోస్ సొల్యూషన్స్
ఎన్నో సంవత్సరాలుగా గృహ నిర్మాణ రగంలోని మహా సిమెంట్కు మంచి గుర్తింపు ఉన్నది. ప్రాపర్టీ షోకు వచ్చిన సందర్శకులకు మా మహా సిమెంట్ అందిస్తున్న సేవలను వివరిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు మా కృతజ్ఞతలు.
– నాగార్జున, సీనియర్ సేల్స్ మేనేజర్ (మహా సిమెంట్)
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు చేరేలా ప్రాపర్టీ షో నిర్వహించడం చాలా మంచి విషయం. దీని ద్వారా ఒక్కరోజే 40 నుంచి 50 మందికి సేవలందించాం. లోన్లు, డిపాజిట్లకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేశాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామనే భావన వచ్చింది. ఇలాంటి కార్యక్రమాన్ని మరిన్ని నిర్వహించినా మేం ముందుండి సహకారం అందిస్తాం.
– కృష్ణదియో సింగ్, చీఫ్ మేనేజర్ (బ్యాంక్ ఆఫ్ బరోడా)
ప్రాపర్టీషోలో మా సారథి ఇన్ఫ్రా స్టాల్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాలలో ఉన్న పలు స్థలాలకు సంబంధించిన వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాం. మా ప్రతి ప్రాజెక్టు వంద శాతం డీటీసీపీ లేఅవుట్తో అందుబాటులో ఉంచాం. సందర్శకుల తాకిడి బాగా ఉన్నది. ఈ షో ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే.. 50 శాతం డబ్బు కట్టినా నిబంధనలతో రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– సంతోష్, ఎండీ (సారథి ఇన్ఫ్రా)
కరీంనగర్ నడిబొడ్డున వావిలాలపల్లిలో ఎడ్వెన్సా సెంచరీ ఈపీసీ నిర్మాణాలు చేపట్టాం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అద్భుతంగా నిర్మిస్తున్నాం. క్లబ్ హౌస్, విత్ ఫర్నిచర్, ఫంక్షన్హాల్, జిమ్, యోగా హాల్, ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్రూమ్స్, మల్టీపర్పస్ హాల్, కార్ పార్కింగ్, డ్రైవర్ రెస్ట్ రూమ్స్, విశాల మైన మినీపార్క్, అందరికీ అనుగుణంగా ఉండే వాకింగ్ ట్రాక్.. ఇలా అన్నీ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నాం. సందర్శకుల నుంచి మంచి ఆదరణ ఉన్నది.
– వెంకటపతి శర్మ, ఎడ్వెన్సా ఈపీసీ నిర్వాహకుడు
ప్రాపర్టీ షో ద్వారా చాలా నగరం ఎంత అభివృద్ధి చెందబోతుందో తెలుస్తుంది. ఇక్కడ చాలా గృహ నిర్మాణ సంస్థలతోపాటు, ఇంటి నిర్మాణంలో అవసమరమయ్యే సిమెంట్, యూపీవీసీ, ఫ్లైవుడ్, సోలార్ ఇలా చాలా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వస్తే ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
– శైలజ, సందర్శకురాలు
నగర వాసులకు అవగాహన కల్పించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి నిర్ణయం. కొత్తగా జిల్లాకు వస్తున్న సంస్థల ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నా. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకునాలనుకునేవారికి, కొనుగోలు చేయాలనుకునేవారికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రాపర్టీ షో ఎంతో బాగుంది.
– గాండ్ల చంద్రశేఖర్, పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు