Vemulawada | వేములవాడ, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో మంగళవారం నుండి ప్రారంభమైన వేద సభలకు ఐదు రాష్ట్రాల నుండి వేద విద్యార్థులు వేద అధ్యాపకులు దాదాపు 200 మంది వరకు వచ్చారు. దీంతో ప్రతీరోజు వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రికి కావాల్సిన భోజనాలను కూడా తయారుచేసి అందించాల్సి ఉంటుంది. అయితే వంట మనిషిని అయితే నియమించారు. కానీ అతని సేవలు అంతంత మాత్రమేనని తెలుస్తోంది.
ఇంకా బుధవారం వచ్చిన అతిథిల కోసం ఆహార పదార్థాలను ప్రైవేటు బ్రాహ్మణ వంట వ్యక్తితో వంటలు చేయిస్తుండడం ఇందుకు నిదర్శనం. రెగ్యులర్ ఉద్యోగి నియమించి 30వేల రూపాయల వేతనం ఇవ్వబోతున్న రాజన్న ఆలయంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకు ప్రైవేటు వ్యక్తులని ఆశ్రయించాల్సి వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే నియామకమైన వంట మనిషి సామర్థ్యాన్ని గుర్తించకుండా నియామకం జరిగినందు వల్లే మళ్లీ ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి.