ముంబై : ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చి బ్రిడ్జి గోడను ఢీకొని.. ఆ తర్వాత బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో షనాయ్ గజ్జల్ (21), ధైర్య దర్శస్ సేథ్ (17), ఆదిత్య జకాస్నియా (19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్ (23) తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మెరైన్ డ్రైవ్ నుంచి హాజిఅలీ వైపు వీరు అతివేగంతో వెళ్తుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.