కమాన్చౌరస్తా, ఆగస్టు 20 : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ సరార్ ఆటలు ఆడొద్దని బీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ హితవు పలికారు. స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి సరారు పేద విద్యార్థులను సాంకేతిక విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేక పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీలవైపు నెట్టివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో పాలిటెక్నిక్ ముగిశాక నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్లోకి (లెటరల్ ఎంట్రీ) అవకాశం ఉండేదని, కానీ ఈ విలీనం వల్ల ఆ అవకాశం కోల్పోయే ప్రమాదముందని, మళ్లీ రెండేళ్లు ఇంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అంతే కాకుండా విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై క్రూరంగా వ్యవహరించారని, ఓ సీఐ విద్యార్థి గొంతు నొక్కారని, తక్షణమే ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నాయకులు ఆరే రవి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, నారదాసు వసంత్ రావు, బండ వేణు యాదవ్, సోమిరెడ్డి నరేశ్ రెడ్డి, వడ్లకొండ పర్షరాం, గంటల రేణుక, విక్రమ్, శనిగరం సతీశ్, పెరుమాండ్ల హరీశ్ తదితరులు పాల్గొన్నారు.